మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర - జననం, ప్రారంభ జీవితం రామాయణం రచించడం వెను...


Life story of maharshi valmiki in telugu.

త్రేతాయుగంలో గంగా తీరంలోని నైమిషారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని నిష్ఠతో తపస్సు చేస్తూండేవారు. అందులోని ప్రచస్థాముడు అనే ముని కుమారుడు రత్నాకరుడు. ఒకరోజు ఆడవిలో ఆడుకుంటూ దారితప్పి ఎటుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడిని ఆ దారిలో ప్రయాణిస్తున్న ఓ వేటగాడు చూశాడు.

ఆ ముని కుమారుని ఓదార్చి తనతోపాటు తీసుకుపోయిన బోయవాడు తన కొడుకుగా పెంచుకున్నాడు. తమ కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారినపడి మరణించి ఉంటారని ప్రచస్థాముడు భావించారు. బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. యుక్త వయసుకు వచ్చిన రత్నాకరుడికి ఓ కన్యతో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు సంతానం కలిగారు. వారితోపాటు తల్లిదండ్రులను పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు, దొంగతనాలను వృత్తిగా చేసుకుని కొన్ని సందర్భాల్లో బాటసారులను చంపడానికి కూడా వెనుకాడేవాడు కాదు.

అడవిలో బాటసారుల కోసం ఎదురుచూస్తున్న సమయాన నారద మహర్శి ఓ సాధారణ మావన రూపంలో ఆ దారి వెంట వచ్చాడు. ఆయనను దోచుకోడానికి రత్నాకరుడు ప్రయత్నస్తే తన దగ్గర వీణ , రుద్రాక్షలు , కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవన్నా వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెట్టాడు. నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించగా తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదులిచ్చాడు.

పోషణ కోసం తెలిసిన విద్య ఇది ఒక్కటే ... పాప పుణ్యాలు నాకు తెలియవని అన్నాడు. రత్నాకరునికి జ్ఞానోదయం కలిగించడానికి నారదుడు ఓ ఉపాయం పన్నాడు. ఓ బోయవాడా నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారేమో అడిగి తెలుసుకోమని తనతో పాటు ఇంటికి వెళ్లాడు. తాను చేస్తున్న పాపాల్లో మీరూ కూడా భాగస్వాములే కదా అని తల్లి దండ్రుల , భార్యా బిడ్డలను ప్రశ్నిస్తే వారు అందుకు సమ్మతించలేదు. సరికదా కుటుంబ పోషణ ఇంటి యజమాని బాధ్యత, పాప, పుణ్యాలు ఒకరి నుంచి ఇంకొరికి ఇవ్వలేం , తీసుకోలేమని బదులిచ్చారు.

వారి మాటలతో పశ్చ్యాత్తాపం చెందిన రత్నాకరుడు పాపవిముక్తి కలిగించాలని నారదుని వేడుకొన్నాడు. అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపించి భక్తి మార్గానికి " రామ రామ " అనే రెండక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పటి నుంచి నైమిషారణ్యంలో రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నేళ్లు తపస్సు చేశాడు. తపస్సులో కూర్చున్న రత్నాకరుడి చుట్టూ పుట్టలు మొలిచాయి. అలా కొనేళ్లు గడిచిన తర్వాత పుట్టలో బక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామ రామ రామ అంటూ నారదుడు మూడుసార్లు పలికాడు.

ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వచ్చాడు. రత్నాకరా నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు... దేవుడు నిన్ను కరుణిచాడు... నీవు మళ్ళీ జన్మించావు.. ఈ పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కల్యాణం కోసం ఓ గొప్ప కావ్యాన్ని రాస్తావని నారదుడు దీవించి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామయాణాన్ని సంకలనం చేశాడు. సంస్కృతంలో రాసిన మొదటి కావ్యం కాబట్టే రామయాణాన్ని ఆదికావ్యం అంటారు. అలాగే వాల్మీకి మొదటి శిష్యులు కూడా రాముడి కుమారులైన లవకుశలు.

#Valmiki,
#valmikijayanti,
#maharshivalmiiki, #valmikimaharshi,
valmiki ramayana,
Valmiki jeevitha charitra in telugu,
Valmiki charitra telugu,
Valmiki Story For Children in telugu, valmiki history in telugu, valmiki in telugu, valmiki muni life story, stories in telugu, ramayanam in telugu, ramayanam in telugu full story


Comments