శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రాముఖ్యతలేంటి ఉగాది విశిష్టత ఖగోల శాస్త్రరీత్య...

చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని నారద పురాణంలో వివరించారు. వసంతం రుతువు ప్రారంభమైన చైత్రశుక్ల పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా ప్రజాపతి బ్రహ్మ ఈ రసజగత్తును సృష్టించాడు. కాల గణన, గ్రహ నక్షత్ర, రుతు, మాస వర్షాలను, వర్షాధిపులను ప్రవర్తింపజేశాడు. కాలగమనంలో మార్పులు సహజం. కల్పంలో యుగాలు. ఈ యుగాలు మారేకొద్దీ ధర్మాలు కూడా మారుతాయి. ప్రస్తుతం కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆయా పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించి చెప్పవచ్చు. తెలుగు సంవత్సరాలు 60. ప్రభవతో మొదలై అక్షయతో ముగిస్తే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ తిరిగి ప్రభవతో ఆరంభమవుతుంది. ఈ పేర్ల వెనుక భిన్న వాదనలు ఉన్నాయి. ఓ పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడి 16100 మంది భార్యల్లో సందీపని అనే రాజకుమారికి 60 మంది సంతానం. వారి నామాలనే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు. నారదుడి పిల్లల పేర్లు వీటికి పెట్టారనే మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. దక్షుడు కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు. #చైత్రశుక్ల పాడ్యమి , #ఉగాది , #ugadi, #krodhi, #క్రోధి నామ సంవత్సర, #srikrishna, #festivals,

Comments