Sri Ramayanam Ayodhyakanda part-1 | శ్రీమద్రామాయణం కావ్యంలో అరణ్య కండలో...

పర్ణశాలలో సీతారామలక్ష్మణుల జీవనం వారిని గోదావరీతటాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకొని నివసించమని అగస్త్యుడు సూచించాడు. పంచవటికి వెళ్ళేదారిలో వారికి జటాయువు అనే పెద్ద గ్రద్ద రాజు కనిపించాడు. తాను దశరధుని మిత్రుడనని, ఆశ్రమసమీపంలో సీతను కనిపెట్టుకొని ఉంటానని అన్నాడు. పంచవటిలో రాముడు చూపిన స్థలంలో లక్ష్మణుడు చక్కని పర్ణశాల నిర్మించాడు. అది సీతాములకు స్వర్గంలా అనిపించింది. అక్కడ వారు చాలా కాలం సంతోషంగా గడిపారు. శూర్పణఖ భంగం రామునితో మాట్లాడుతున్న శూర్పణక రావణుని చెల్లెలు శూర్పణఖ అనే రాక్షసి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నది. ఆమె కామరూపి. ఒకమారు వారి పర్ణశాలకు వచ్చి రాముని చూచి మోహించి తనను పెళ్ళి చేసుకోమని అడిగింది. రాముడు, లక్ష్మణుడు ఆమెతో పరిహాసాలాడారు. ఆమె కోపించి సీతను తినివేయబోయింది. అపుడు రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూ, చెవులూ కోసివేశాడు. శూర్పణఖ యేడుస్తూ తన సోదరుడైన ఖరునితో జరిగిన విషయం మొరపెట్టుకుంది. ఖరుడు యముళ్ళాంటి పధ్నాలుగు రాక్షసులను పిలిచి రామలక్ష్మణులను చంపిరమ్మని ఆజ్ఞాపించాడు. పదునాలుగు బాణాలతో రాముడు వారిని సంహరించేశాడు. శూర్పణఖ బావురుమంటూ ఖరునివద్దకుపోయి అతను చేతకానివాడని దెప్పిపొడిచింది. ఉద్రిక్తుడైన ఖరుడూ, అతని సేనాధిపతి దూషణుడూ వీరాధివీరులైన పధ్నాలుగు వేల రాక్షససేనతో దిక్కులు పిక్కటిల్లే పెడబొబ్బలతో, భేరీభాంకారాలతో, సాగరంవలె పొంగుతూ రామలక్ష్మణులపై దండెత్తారు. Sri Ramayanam Ayodhyakanda part-1 | శ్రీమద్రామాయణం కావ్యంలో అరణ్య కండలో పంచవటి నివాసం ముఖ్య మలుపు రామాయణానికి. #panchavati , #aranyakanda , #teluguramayanam , #valmikiramayanam , #parnasala , #valmikimaharshi , #vanavasam , #ramayanamtelugu , #teluguramayanam , #ramayanam , #valmikiramayanamaudiobook , #vachanaramyanam , #surpanaka , #kardushana , #bhadrachalam , #rama , #ayodhya , #ayodhyarama , #aranyakanda , #aranyakandam , #chaganti , #chagantikoteswararao , #chagantipravachanalu ,

Comments