Sri Ramayanam Ayodhyakanda part-5 | శ్రీమద్రామాయణం కావ్యంలో మారీచుని మా...

మాయలేడితో మోసం రామునితో బంగారు లేడిని తెమ్మని చెబుతున్న సీత - రాజా రవివర్మ చిత్రం సీత పర్ణశాల వద్ద పూవులు కోసుకొంటూ ఇక అరణ్యవాసం ఎంతోకాలం లేదనుకొంటున్నది. ఆ సమయంలో ఆమెకు వెండి చుక్కలతో మెరుస్తున్న అపూర్వమైన బంగారు లేడి కంటబడింది. వయ్యారాలు పోతూ గెంతుతున్న ఆ లేడిని చూచి సీత అది తనకు నచ్చిందనీ, దాన్ని తెచ్చిపెట్టమనీ రాముని కోరింది. అది రాక్షస మాయ అని, లోకంలో అలాంటి లేడులుండవని లక్ష్మణుడు గట్టిగా చెప్పాడు. రాక్షసుడైతే చంపి వస్తానని, అంతవరకు సీతను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని లక్ష్మణునకు చెప్పి రాముడు బయలు దేరాడు. ఆ లేడి గెంతుతూ, మాయమౌతూ, మళ్ళీ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపోయింది. ఇక లాభం లేదనుకొని రాముడు ధనుస్సు ఎక్కుపెట్టి బాణం విడిచాడు. దానితో ఆ లేడి మారీచునిగా నిజరూపం ధరించింది. మారీచుడు అయ్యో సీతా, అయ్యో లక్ష్మణా అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఆపదను శంకించిన రాముడు వడివడిగా పర్ణశాలవైపు సాగాడు. ఆ ఆర్తనాదం విని, రామునికి ఏదో అపాయం సంభవించిందని సీత భయ విహ్వల అయ్యింది. త్వరగా రామునికి సహాయంగా వెళ్ళమని లక్ష్మణుని కోరింది. మూడు లోకాలూ ఎదురై వచ్చినా రాముని జయించలేరనీ, కనుక అది రాక్షస మాయయే అనీ, తాను అన్నగారి మాట ప్రకారం సీతకు రక్షణగా ఉంటాననీ లక్ష్మణుడు అన్నాడు. దానితో సీత కోపించి లక్ష్మణుని పరుషంగా నిందించింది. దుర్బుద్ధితో రామునికి కీడు జరుగాలని అతను కోరుకొంటున్నాడని దూషించింది. లక్ష్మణుడు ఆ నిందలకు చింతించాడు. తనను అలా సందేహిస్తున్న ఆ తల్లి ఆపదల పాలౌతుందని వగచాడు. వన దేవతలు సీతను రక్షించాలని కోరుకొని, దుర్నిమిత్తాలకు భయపడుతూనే రాముని అన్వేషణకు బయలుదేరాడు. #మాయలేడి , #mayalady, #sitaapharana , #marichinumaya , #mayaledi , #valmikiramayanam , #aranyakanda , #ramayanamtelugu , #jatayu , #rama , #sita , #chaganti , #chagantikoteswararao , #chagantipravachanalu , #namburi , #nandurisrinivas , #parnasala , #garikipatipravachanam , #garikapati , #iscon_video ,

Comments