రామసేతువు నిర్మాణం శ్రీమద్రామాయణం కావ్యంలో యుద్ధ కాండ -3 |Srimad Ramayan...
రావణుడి చారులైన శుక సారణులు రామ, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమంతాది వీరుల పరాక్రమాన్ని రావణునికి వివరించారు. వానరసేన ఎంత ఉందో లెక్కపెట్టడం అసాధ్యమన్నారు. సీతను రామునకప్పగించడం మంచిదని తమకు తోచిందన్నారు. ప్రాసాదం పైకి తీసుకెళ్ళి వానరవీరుల సేనానాయకులలోని ముఖ్యులను చూపించారు -
వేనవేల సేనాధిపతులతో కలిసి సింహనాదం చేస్తున్నవాడు సకల వానర సైన్యాధిపతి నీలుడు. అంగదుడు తనతండ్రితో సమానుడైన వాడు, రాముని విజయంకోసం కృతనిశ్చయుడు. సముద్రం మీద సేతువును నిర్మించిన ఘనుడు నలుడు. త్రిలోకాలలోనూ ప్రఖ్యాతుడైన శ్వేతుడు వెండిలా మెరిసిపోతున్నాడు. యుద్ధం అంటే అతిప్రీతి కలిగిన కుముదుడు గోమతీతీరం నుండి వచ్చాడు. కపిలవర్ణుడై న రంభుడు వింధ్య పర్వతాలనుండి వచ్చాడు.
Comments
Post a Comment